TG: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ సదస్సుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని J&K హౌస్లో ఒమర్ అబ్దుల్లాతో ఉత్తమ్ భేటీ కానున్నట్లు సమాచారం. అయితే, రైజింగ్ సదస్సుకు వివిధ రాష్ట్రాల CMలను మంత్రులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.