KNR: ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా మందులు స్వీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు 4 ఏఎన్సీ పరీక్షలు చేయించుకోవాలని, ఎంతో ఖరీదైన టీఫా వంటి స్కానింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని తెలిపారు.