SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 2, 13 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ మేరకు వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న శుభ్రత పనులను పరిశీలించారు. పనులు సక్రమంగా నిర్వహించాలని, చెత్త సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.