AP: రైలులో సీటు కోసం CRPF విశ్రాంత పోలీసు రివాల్వర్తో బెదిరింపులకు దిగాడు. యలహంక నుంచి కాచిగూడకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆర్.కృష్ణాపురం గ్రామానికి చెందిన మనోహర్ తనకు సీటు ఇవ్వాలంటూ ప్రయాణికులను బెదిరించాడు. దీంతో కొందరు గుంతకల్లు RPFకు సమాచారం ఇవ్వడంతో రైలు గుంతకల్లు చేరుకోగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు.