TG: కామారెడ్డి జిల్లా గాంధారి ఎక్స్రోడ్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. BJP ఎమ్మెల్యేల బృందాన్ని బాన్సువాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోంది. కామారెడ్డి అంశాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. బాన్సువాడకు మళ్లీ వచ్చి తీరుతాం’ అని అన్నారు.