AP: కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిర్మాణాత్మకంగా ఉండాల్సిందిపోయి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ‘అసెంబ్లీకి రాకుండా వైసీపీ నేతలు బయట రాజకీయాలు చేస్తున్నారు. శాఖలపై మంత్రులు గ్రిప్ పెంచుకోవాలి. మంత్రులతో సమాధానాలు చెప్పించే బాధ్యత పయ్యావులదే. అసెంబ్లీలో చర్చ సమయంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.