AP: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరులో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చు. నెల్లూరు, ప్రకాశం, పల్నాడులో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఉరుములు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండరాదని అధికారులు ప్రజలను హెచ్చరించారు.