AP: మాజీ సీఎం జగన్ ఎల్లుండి విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్లానున్నారు. ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను ఆశీర్వదించనున్నారు.