AP: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈరోజు టీడీపీలో చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాజశేఖర్ పసుపు కండువా కప్పుకోనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వైసీపీకి, శాసన మండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్గా వ్యవహరించారు. అయితే, ఆయన రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.