ఢిల్లీ పేలుడు కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో నిందితుడైన డాక్టర్ షాహిన్ను అధికారులు సీన్ రీక్రియేషన్ కోసం అల్-ఫలా యూనివర్సిటీ తీసుకెళ్లారు. తదుపరి విచారణ కోసం అతడిని లక్నో, కాన్పూర్కు తీసుకెళ్లనున్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను లక్నో, కాన్పూర్, జమ్మూకాశ్మీర్, సహరన్పూర్లకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.