సత్యసాయి: పెనుకొండ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బట్టా బాలకృష్ణ చౌదరి అనారోగ్యంతో బాధపడుతు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పెనుకొండ టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు శుక్రవారం కొండంపల్లి గ్రామానికి చేరుకుని బాలకృష్ణ చౌదరి యొక్క భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.