KRNL: ఈనెల 29 నుంచి 30 వరకు అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్- 14 హ్యాండ్ బాల్ పోటీలకు కృష్ణగిరిలోని తొగర్చేడు ఉన్నత పాఠశాల విద్యార్థి మోహన్ ఎంపికయ్యారు. విద్యార్థిని HM రొక్కం రాఘవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పీడీ శ్రీనివాసులు శిక్షణలో జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.