NDL: నంది కోట్కూరు పట్టణంలో మహాత్మ జ్యోతి రావు పూలె 135వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయ సూర్య శుక్రవారం పూలె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారులు జ్యోతి రావు పూలె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.