TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ 11, హన్మకొండ 12, పటాన్చెరు 12.6, హయాత్నగర్ 13, రాజేంద్రనగర్ 14.5, నిజామాబాద్ 14.8, దుండిగల్ 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే.. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో మరింత చలి తీవ్రత పెరగనున్నట్లు తెలిపారు.