CTR: పుంగనూరు మండల పరిధిలోని ఉలవలదిన్నె గ్రామానికి చెందిన తేజస్వినికి.. ముల్లాబగల్కు చెందిన నవీన్తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త, వారి కుటుంబ సభ్యులు అదనపు కట్నం తేవాలని నిత్యం వేధిస్తున్నారని ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.