TG: ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిలు అనేవి వారసత్వంగా వచ్చేవేనని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులకు మానవీయ కోణం ఉందని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వం పదవీ విరమణ వయసును మూడేళ్లకు పెంచిందని.. ఆ భారమంతా ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందన్నారు.