AP: దివంగత సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడే తిరుమలలో ఈ రకమైన చర్యలు మొదలయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారివి ఏడు కొండలు కాదు.. రెండు కొండలు మాత్రమే అని వైఎస్సార్ హయాంలో జీవో ఇచ్చారని తెలిపారు. దీనిపై రెండేళ్ల పాటు ఆందోళనలు జరిగేతే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష తప్పదని ఆరోపించారు.