భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిమిత్తం ఆమె ఇంగ్లాండ్ వెళ్తుంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఉద్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’ అని సోషల్ మీడియాలో సింధు పేర్కొంది.