TG: రాష్ట్రంలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎంవో వాట్సాప్ గ్రూప్తో పాటు పలువురు మంత్రులకు చెందిన వాట్సాప్ మీడియా గ్రూప్లను హ్యాక్ చేశారు. SBI బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ను షేర్ చేశారు. కాగా, ఇటీవలే సైబర్ నేరగాళ్లు హైకోర్టు వెబ్ సైట్ను కూడా హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.