TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో మృతి చెందిన పసిపాప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని BRS నేత పుట్ట మధుకర్ అన్నారు. ఆ పసిపాప ప్రపంచాన్ని చూడకముందే.. కులవివక్షకు గురైందన్నారు. ఈ ఘటన మనం ఏ దశాబ్దంలో ఉన్నామో అర్ధం కావడం లేదని మండిపడ్డారు. ఇంకా అనాగరికతలోనే ఉన్నామా? అనే ఆలోచన కలుగుతుందని వాపోయారు.