TG: హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు సీఎం రేవంత్ చేరుకున్నారు. ఈ వేదికగా గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 783 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.