HYDలో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దీని వల్ల భవిష్యత్తులో ఎయిర్క్రాఫ్ట్ల తయారీ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఆ లాభం ప్రయాణికులకు కూడా అందుతుందని తెలిపారు. దేశంలో ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ప్రారంభం కావడం సంతోషకరమన్నారు.