TG: బనకచర్లతో రాష్ట్రానికి నష్టం లేదని ఏపీ మంత్రి నిమ్మల అన్నారని MLC కవిత అన్నారు. ‘గోదావరి నీళ్లు తీసుకెళ్లేందుకు KCR ఒప్పుకున్నారని అన్నారు. వృథా జలాల వాడకానికి కూడా మాజీ సీఎం షరతు పెట్టారు. పోలవరం నుంచి నదుల అనుసంధానాన్ని కేసీఆర్ ఒప్పుకోలేదు. కేంద్ర నిధులపై సీఎం రేవంత్ మాట్లాడటం లేదు. ఢిల్లీలో సీఎం పోరాడితేనే బనకచర్ల ప్రాజెక్టు ఆగుతుంది’ అని అన్నారు.