TG: ఇవాళ్టి నుంచి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో 10 రోజుల పాటు కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. AP, TG డీసీసీ అధ్యక్షులు పాల్గొనే ఈ శిబిరంలో భాగంగా నేతలు 11 గ్రామాల్లో బస చేస్తారు. మదన్పల్లిలో ఉపాధి పనుల్లో రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్, షర్మిల పాల్గొంటారు. ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.