తెలుగు రాష్ట్రాల్లో నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. నిన్న AP అల్లూరి జిల్లా అరకులో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TG వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 8.1, ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6గా రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా పడిపోయే అవకాశముందని అధికారులు తెలిపారు.