AP: టీటీడీ ఆలయాల్లో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాల వితరణకు TTD ఏర్పాట్లు చేస్తోంది. 60 అనుబంధ ఆలయాల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. వాటిలో 12 వరకు ఆలయాల్లో ఇప్పటికే వితరణ జరుగుతోంది. త్వరలో మిగిలినచోట్ల ప్రారంభించేందుకు TTD ఛైర్మన్ BR నాయుడు, EO సమీక్షలు నిర్వహించారు. వచ్చే మార్చికల్లా అన్ని ఆలయాల్లో ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.