AP: కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 2.5 లక్షల ఆరోగ్య బీమా పచ్చి మోసమని అన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంతా బూటకమని తెలిపారు. ‘పేదోడి సంజీవనిని ప్రైవేట్ పరం చేసేందుకే UHC అంటూ డ్రామాలు. ప్రైవేట్ బీమా పేరుతో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చుతున్నారు’ అని మండిపడ్డారు.