శాసనమండలిలో నిన్న వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని, మండలిలో చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు జగన్ హయాంలో ప్రతి అంశంలో దోచుకున్నారని, తిరుమల లడ్డూను కూడా కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.