TG: రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటల్లో అతిభారీ వర్షం సూచన ఉందని తెలిపింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లిలో.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.