TG: కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటన జారీ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ లింక్స్ పంపుతున్నారని, ఆయా పథకాలకు అర్హత చెక్ చేసుకోవాలని.. తొందరపడి ఎవరూ లింక్లు క్లిక్ చేయొద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్సైట్లు మాత్రమే వాడాలని పోలీసులు తెలిపారు.