AP: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్కు పోలీసు కస్టడీ విధించారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన్ని కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు గుంటూరు జైలులో ఉన్న అతని వద్దకు ఒంగోలు పోలీసులు వెళ్లారు. జీజీహెచ్లో విజయ్ పాల్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం విజయ్ పాల్ను ఒంగోలుకు తీసుకెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన్ని విచారించనున్నారు.