AP: పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పోలవరం జిల్లా గూడురు గ్రామస్థులు ఐస్క్రీం బండ్లు/ఆటోలు గ్రామంలోకి రాకుండా నిషేధించారు. వస్తే రూ.5 వేల ఫైన్ తప్పదని స్పష్టంచేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐస్క్రీం తిన్న పిల్లలకు దంత, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తున్నాయని.. వాటిల్లో ఏ రసాయనాలు కలుపుతున్నారో తెలియదని, వారి ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్థులు తెలిపారు.