TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులాలు మతాలు ప్రస్తావన లేకుండా పైశాచిక సంఘటన ఏదైనా ఖండించాల్సిందేనన్నారు. ఈ దాడిలో చిన్నపాప మృతి బాధాకరమన్నారు. పాప మృతికి కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.