AP: మహిళలకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2024-25లో లక్ష మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసినట్లు చెప్పారు. ఈ సంఖ్యను 2028-29 నాటికి 5 లక్షల మందికి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.