TG: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాంపల్లిలోని సింగరేణి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి ఆటోలో భవన్కు చేరుకున్న కవిత.. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కవితతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.