తెలుగు రాష్ట్రాల BJP ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో CM చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని, బాబు పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. పెట్టుబడులు ఎక్కువగా AP వైపు వెళ్తున్నాయని.. మంచి అభివృద్ధికి ఇది సూచిక అని పేర్కొన్నారు. వైసీపీ SMలో చేస్తున్న విమర్శలకు BJP కూడా దీటుగా కౌంటర్ ఇవ్వాలని చెప్పారు.