PPM: పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి వద్దకు వచ్చిన నలుగురు దివ్యాంగులు తమ గోడు వెళ్ళబోసుకుంటూ తమకు మూడు చక్రాల సైకిళ్లను ఇప్పించాలని విన్నవించారు. వారి పరిస్థితికి చలించిన కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది రమణను పిలిచి వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లను ఇవ్వాలని ఆదేశించారు.