ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ, తమిళనాడు, కర్ణాటకలో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. కోయంబత్తూరు కారు పేలుడు కేసు, మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు దాడులపై అనుమానిత ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు.
దేశీయ ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్తో (Tanmay Bhat) వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆయన నోటి దురుసు కారణంగా బ్యాంకు ఆయనను తప్పించే వరకు వచ్చింది.
PM Narendra Modi ప్రధాని నరేంద్రమోదీకి వాలంటైన్స్ డే రోజున అరుదైన బహుమతి దక్కింది. మోదీకి సూరత్ లోని ఆరో వర్సిటీ విద్యార్థులు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని మోడీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు గాను విద్యార్థులు బంగారంతో పూత పూసిన బొకేను ప్రధానికి బహుమతిగా అందజేశారు.
కన్నబిడ్డలు ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, ఓడీజీపీ (DGP) అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ (IPS) ఐపీఎస్గా ఎదురొచ్చి సెల్యూట్ చేస్తే.. ఆ (sweet moments)మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అలాంటి సందర్భమే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
I-T teams at BBC offices:బీబీసీ ఆఫీసుల్లో (bbc office) ఆదాయపన్ను (income tax) శాఖ అధికారుల బృందాలు సోమవారం సర్వే చేపట్టాయి. ముంబై (mumbai), ఢిల్లీలో (delhi) గల కార్యాలయాలకు ఈ రోజు ఉదయం చేరుకున్నాయి. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైళ్లను (mobiles) స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోవాలని ఉద్యోగులను కోరినట్టు తెలిసింది.
2024 ఎన్నికల్లో తమకు ఏ పార్టీతో పోటీ ఉండదని కేంద్ర హొంశాఖ మంత్రి (Amith Shah) అమిత్ షా అన్నారు. యావత్ దేశం ప్రధాని మోదీకీ మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. (Ani) ఏఎన్ఐ మీడియ సంస్దకు ఇంటర్వూలో భాగంగా షా పలు అంశాలపై మాట్లాడారు.
Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
Hardik Pandya : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకోనున్నాడు. తన భార్యనే ఆయన రెండోసారి ఈ వాలంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకుంటున్నాడు. కరోనా సమయం మొదటి సారి వీరిద్దరి పెళ్లి జరిగింది. ఒక అబ్బాయిని కన్నారు. ప్రస్తుతం కరోనా భయం పూర్తిగా పోవడం భారీస్థాయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని తన ముచ్చ...
జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్కు చెందిన నిఖితా చౌరిసియా... శివుడిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే కళ్యాణతోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాల వేసి, శివుడిని భర్తగా అంగీకరించింది.
గురుగ్రామ్కు చెందిన ఓ టెక్కీ యువకుడు ఓ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. లవర్స్ డే రోజున సింగిల్స్ అయిన యువతులు తమ సేవలను వినియోగించుకోవాలని వినూత్న ప్రచారం ప్రారంభించాడు. తమ భాగస్వామి కోసం వెతికే యువతుల కోసం తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్ను అందిస్తామని అందరినీ ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల షకుల్ గుప్తా తన ఇన్స్టాలో 'boyfriend on rent'తో ప్రమోట్ చేస్తున్నాడు.
Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక... మరోసారి వాయిదా....! : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా... ఫిబ్రవరి16న జరగాల్సి ఉంది. అయితే.... అది కూడా ఇప్పుడు వాయిదా పడటం గమనార్హం. ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుపై ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 విచారణ తర్వాత, MCD మేయర్ ఎన్ని...
petrol bunk staff cheated high court judge:పెట్రోల్ బంకులో (petrol bunk) మోసాలు అన్నీ ఇన్నీ కావు. రీడింగ్ వద్ద తేడా కొడతాయి. మధ్యప్రదేశ్లో (madhya pradesh) కూడా ఇలాంటి ఘటన జరిగింది. హైకోర్టు జడ్జీకే (high court) కేటుగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఇంకేముంది విషయం జిల్లా కలెక్టర్కు (collector) తెలియజేయడంతో.. వెంటనే సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. సదరు బంక్ను సీజ్ కూడా చేశారు.
ఇండియాలో 2040 నాటికి 73 శాతం మంది షుగర్(మధుమేహం), 65 శాతం మంది ఊభకాయం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిర్వహించిన సర్వేలో తెలిపింది.