ఈ ప్రదర్శనలో ప్రపంచంలోని ముఖ్య దేశాల వైమానిక సంస్థలు, వాయుసేన విమానాలు పాల్గొంటాయి. హెలికాప్టర్లు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీలు కూడా ప్రదర్శనకు వచ్చాయి. కంపెనీల మధ్య రూ.75 వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరుగుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
నీటిలో చిరుత కన్నా వేగంగా పరుగెత్తగలడు.. చేపలు, తిమింగళాల కన్నా వేగంగా ఈదగల నైపుణ్యం అతడి సొంతం. పోటీలు ఎక్కడైనా అతి వేగంగా నీటిలో దూసుకెళ్లగలడు.. పతకాలు కొల్లగొట్టగలడు. తండ్రి అగ్ర నటుడైనా అతడి పలుకుబడిని ఏనాడు వాడుకోలేదు. కష్టపడ్డాడు.. ఎదిగాడు.. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు.
హిమాలయాల (Himalayas) మంచు కొండల్లో కొలువైన అందమైన ప్రదేశం. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గిన్నీస్ రికార్డు బదలయ్యేలా ఓ క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రస్తుతం చలికాలంలో మంచుగడ్డగా మారిన సరస్సులో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు (Athletes) దూసుకెళ్లనున్నారు.
అసోంలో భూకంపం(Assam Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 4.18 గంటలకు నాగావ్ పరిధిలో భూమి కంపించింది.
స్వామి దయానంద్ సరస్వతి (Dayanand Saraswati) 200వ జయంతి వేడుకలను ఆదివారం ( New delhi) న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారింభించారు. ఈ నేపథ్యంలో నే అంతకముందు దయానంద్ సరస్వతి గురించి పేర్కొంటూ ప్రధాన మంత్రి కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
Boy Takes Father Hospital In Pushcart:తండ్రి (father) అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రికి (hospital) తీసుకెళ్లే బాధ్యత ఆరేళ్ల బాలుడిపై (boy) పడింది. తన తల్లితో (mother) కలిసి తోపుడు బండిపై దవాఖానకు (hospital) తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ (madhya pradesh) సింగ్రౌలిలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchibabu) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణ (Telangana) నుంచి అభిషేక్ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే.
గుజరాత్ లోని సూరల్ జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూపంకం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు తెలిపారు.
చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదుకున్నని రాష్ట్రతి (Rashtrath) ద్రౌపది ముర్ము తన చిన్నటి జ్ఞాపకాలను విద్యార్దులతో పంచుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) లోని రమాదేవీ మహిళా యూనివర్సటీ స్నాతకోత్సంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.
గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
భారత్లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.
Turkey Earth Quake : టర్కీ భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 25వేల మందికి పైగా ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.