వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్ను నియమించింది.
ఈ సమయంలో ఎమ్మెల్యే ‘లంచగొండి, బందిపోటు నువ్వు. నీ చెంప పగలగొడతా’ అంటూ ఆమెకు చేయి చూపించాడు. ఏమిటా మాటలు అని సీఐ అనిత నిలదీయగా చేయి వేసి ఎమ్మెల్యే నెట్టి వేశాడు. దీంతో తోటి పోలీసులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
బీబీసీ కార్యాలయాల్లో దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకున్నాయి. తభారత ఐటీ అధికారుల సోదాల గురించి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేఛ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని.. అన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.
కొనప్రాయంతో ఉన్న వారిని అవయవదానంతో కాపాడవచ్చు. ముందే అవయవదానానికి అంగీకరిస్తే దురదృష్టవశాత్తు మనకు ఏమైనా జరిగితే ఆ అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి పునర్జన్మ లభిస్తుంది. ఒకవేళ మనం ప్రమాదానికి గురవడం.. మన అవయవాలు ఏవైనా దెబ్బ తింటే జీవన్ ధాన్ ద్వారా అవయవాల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. మనం ఇతరులు.. ఇతరులు మనకు దోహదం చేసేలా అవయవదానం ఉంటుంది.
ఈరోజు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక బెంగాల్ జట్టు 1990 తర్వాత మళ్లీ ఇదే వేదికపై ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.
వివిధ కేటగిరిల్లోనూ ఈ నివేదికను ఏడీఆర్ తయారు చేస్తుంది. ఏడీఆర్ నివేదికను పరిశీలిస్తుంటే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలుస్తోంది. ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి అత్యధికంగా బీజేపీ విరాళాలు వస్తున్నాయి. ఢిల్లీ మినహా ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో అక్కడి నుంచే అధిక విరాళాలు వస్తున్నాయి. కాగా తాజా నివేదికపై రాజకీయ దుమారం రేగింది.
ఈరోజే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై..రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించనున్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సూప్రియా (Supriya)ప్రశంలు జల్లు కురిపించారు. కేబినెట్ లో గడ్కరి మాత్రమే పనిచేస్తున్నరని ఆమె అన్నారు. సెంట్రల్ మహారాష్ట్రలోని పర్భానీ(Parbhani) జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో సూప్రియా ఈ విధంగా కామెంట్ చేశారు.
ఉద్యోగులకు కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది. జులై నుంచే డీఏ (DA) పెంపు జరగాల్సి ఉంది. కానీ.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపు విషయంపై కేంద్ర క్యేబినేట్ (Cabinet )పలుమార్లు సమావేశం అయింది. మార్చిలో డీఏను కేంద్రం పెంచునున్నది.
దేశంలో సెట్ టాప్ బాక్స్ లేకుండా వినియోగదారులు ఉచితంగా 200+ టీవీ ఛానెళ్లు వీక్షించే సౌకర్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్జిపిటి(ChatGPT)ని ఉపయోగించడాన్ని నిషేధించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. విద్యార్థులు ఉపయోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అదానీ గ్రూప్ సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ ఛైర్పర్సన్ మాధబి పూరీ బుచ్లకు రెండు వేర్వేరుగా లేఖలు రాస్తూ డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
ప్రేమికుల రోజు(lovers day)న దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో విషాద ఘటన చేటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ధాబా రిఫ్రిజిరేటర్లో ఉంచి, ప్రేమికుల రోజున మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.