KDP: బద్వేల్ నియోజకవర్గంలోని చెరువుల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బొజ్జ రోశన్న సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి వచ్చిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలపై చర్చించారు. చెరువులను పరిశీలించి మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు.