దర్శకుడు కనకమేడల వ్యవహారం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. శుభమా అని భైరవం సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతూంటే, ఎప్పుడో అజ్ఞానంతో, అవివేకంతోనో, ఒళ్లు కొవ్వెక్కో చేసిన కోతిపని ఇప్పుడు కనకమేడల మెడకి పాముల చుట్టుకుని బుసలు కొట్టి, సెగలు కక్కుతోంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా కనకమేడల విజయ్కి చుక్కలు చూపిస్తోంది
జీవితమంతా కొత్తవారిని ప్రోత్సహిస్తూ, వారి ద్వారా సూపర్డూపర్ హిట్లు నిర్మిస్తూ అతి తక్కువ కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్న ఘనత గడిచిన మూడు దశాబ్దాలలో దిల్రాజుకి తప్పితే మరొక్కరికి దక్కనే దక్కదు.
వార్ టులో హృతిక్ రోషణ్ కాంబినేషణ్లో ఈక్వల్ రోల్ని అత్యధిక పారితోషకానికే సైన్ చేశాడు తారక్. హిందీ బాగా మాట్లాడగలడు. మంచి మాడ్యులేషన్ అన్నీ ఉన్న తారక్కి వార్ టు అంగీకరించడం పెద్ద సమస్య అనిపించలేదు.
పెద్ది చిత్రానికి గానూ నాటు గ్రామీణ పరమైన సెట్ను కూడా నిర్మించి, అందులో కథలో అతి ఎక్కువ భాగం చిత్రీకరణ జరుగుతుంది. దీని కోసం అదిరిపోయే సెట్ట్ నిర్మించారు. మనం ఆల్రెడీ టీజర్లో చూశాం. అంతా మొత్తం గ్రామీణ వాతావరణం ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేం కనిపించాయి. అవి కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి.
రత్నంతో ఉన్న ఆత్మీయానుబంధంతో పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడో సినిమా చేయాలని సంకల్పించారు. డైరెక్టర్ ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు ఏ ఒక్క పేరు ముందుకు రాని పరిస్థితి. అప్పుడే రత్నం డెసిషన్ తీసుకుని పవన్నే డైరెక్ట్ చేయమని ప్రోద్బలం చేశారని అప్పుడు చెప్పుకున్నారు.
అందుకే ఇప్పుడు పానిండియా దృష్ట్యా కానీ, తెలుగులోనూ కూడా మోహన్ లాల్ అయితే బెటర్ అనే నిర్ణయానికి కొన్ని పెద్ద సంస్థలు, కొందరు యువదర్శకులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే నాలుగైదు సినిమాలు మోహన్ లాల్ ప్రధానపాత్రగా కథలు శరవేగంగా తయారవుతున్నాయి. కొత్త దర్శకులైతే పాత హీరోలను ససేమిరా అంటున్నారు, ఆ మేరకు నిర్మాతలను కూడా ఒప్పించుకుంటున్నారు.
అసలే ఓటిటిల దెబ్బకి సింగిల్ స్క్రీన్లు దాదాపుగా అడుక్కుతింటున్నాయి. మెగస్టార్ తర్వాత ధియేటర్లకి జనాలని పరిగెత్తించే మొనగాడే లేడు. ఓ ముగ్గురో నలుగురో ఉన్నా వాళ్ళు మూడేళ్ళకో సినిమాతో ప్రత్యక్షమవుతున్నారు. ఈ లోగా సింగిల్ స్క్రీన్లు ఈగలు తోలుకోవడమే. ఏ యంగ్ హీరో సినిమాని చూడ్డానికి జనం పెద్ద ఆసక్తి చూపించడం లేదు.
అప్పట్లో అంజి సినిమా కూడా ఇదే విధమైన ఇబ్బందులను ఎదుర్కొంది. ముందు విఐపి డైరెక్ట్ చేసిన సభాపతిని విజువల్స్ బాగా తీశాడన్న ఒకే ఒక్క కారణానికి అంజి సినిమాకి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. తర్వాత ఆయనతో వర్కవుట్ కావడం లేదని సురేష్ కృష్ణని తీసుకొచ్చారు. ఆయన కొన్ని సీన్లు తీసి ప్రాజెక్టును వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చివరికి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డికి బాగా అచ్చొచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణే టే...
అప్పటి సినిమాలే అలా ఈ రోజున సంచలనం క్రియేట్ చేస్తుంటే, మరి అప్పటి కాంబినేషన్లు ఎంత దుమారం లేపుతాయో చెప్పనవసరం లేదు. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, యువరత్న బాలకృష్ణ, లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నిజంగా ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోందా లేదా అనే చర్చ పెద్ద స్థాయిలోనే జరుగుతోంది చిత్రపరిశ్రమలో
పవన్ కళ్యాణ్ సినిమా గురించి పవన్ అభిమానులు ముఖం వాచిపోయున్నారు. ఇటువంటి పరిస్థితులలో కీరవాణి అందించిన బాణీలు డోకొస్తున్నాయని పోష్టులు పెడుతున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి శ్రీరామ పాట విని అందరూ తలలు పట్టుకున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో లుంగీ కట్టుకుని సహజనటి జయసుథ నిలబడ్డ ఓ ఫోటో తెగ వైరల్ అయింది. ఆమె సన్నిహితులు, మిత్రబృందం కూడా శక్తివంచన లేకుండా ఆ స్టిల్ని ఆమెకు ఆ ఫోటోని పంపించి, పంపించి ఊపిరాడనివ్వకుండా చేశారు. ఆ లుంగీ చాలా పాప్యులర్ బ్రాండ్గా డెబ్భై దశకాల నుంచి ఇటీవలి వరకూ కూడా కొనసాగుతూ వచ్చిన శంఖు మార్కు లుంగీ.
మెగా అనిల్ కాంబినేషన్ గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీద మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అదేంటంటే...ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాడనే వార్త మొదటనుంచి వైరల్ అవుతూనే ఉంది.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహరవీరమల్లు పూర్తిగా వార్తల్లో ఎక్కడా లేకపోవడంతో మెగాఅభిమానులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఒక్కసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ కాగానే సముద్ర కెరటాల్లా అభిమానులు ఆకాశమంత ఎత్తుకు ఎగిరి, కేరింతలు కొడుతున్నారు. దీని వెనుక కాంబినేషన్ సెన్సేషన్ కూడా దాగి ఉండడం కూడా ప్రధానమైన కారణంగా భావించాలి.
నిజానికి అందరూ అనుకునేంత పూలపాన్పు కాదు సినిమా పరిశ్రమ. దారంతా ముళ్ళు, రాళ్ళు, కనిపించని అగాధాలు, ఊహించని అవరోధాలు అడుగడుగునా పడగలెత్తుతూనే ఉంటాయి. వాటన్నిటినీ, కేవలం సినిమా పట్ల తీరని మక్కువతోనే ఇక్కడందరూ ఎత్తుపల్లాల మధ్యన మునిగితేలుతుంటారనేది పచ్చినిజం.
అనిల్ రూపొందించే సినిమాలకు వందల వేల కోట్ల బడ్డెట్టులుండవు. అవి పాన్ ఇండియా సినిమాలు కావు. కానీ, అనిల్ రాసే కథలు కూడా ఓ ప్రత్యేకమైన స్లాట్కి చెందినవిగా మాత్రమే తయారవుతాయి. తన కథకి కావాల్సిన హీరోని ఒప్పించగలడు, అందుకు అవసరమైన బడ్జెట్టుకు నిర్మాతలను తెచ్చుకోగలడు.