AP: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 72,473 మంది భక్తులు దర్శించుకోగా.. 23,900 మంది తలనీలాలు సర్పించుకున్నారు. హుండీ ద్వారా టీటీడీకి రూ.4.35 కోట్ల ఆదాయం వచ్చింది.