AP: విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు దేవాదాయశాఖ అధికారులు సౌకర్యాలు కల్పించారు. మాసోత్సవాల్లో దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోలి పాడ్యమి కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.