‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇప్పట్లో OTTలోకి రాదని స్పష్టం చేశాడు. ఈ సినిమాను 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని పేర్కొన్నాడు. ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో అఖిల్, తేజస్వి జంటగా నటించారు.