• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లా పోలీసులకు బంగారు పతకాలు

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు బంగారు పతకాలు లభించాయి. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 8 పతకాలు (4-బంగారు, 4-కాంస్య) సాధించడం పట్ల బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ అభినందించారు.

February 25, 2026 / 08:30 PM IST

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన SP

ADB: భీంపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. స్టేషన్‌కు వచ్చిన ఆయనకు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్నందున ఆసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

February 25, 2026 / 08:30 PM IST

నూతన వధువును ఆశీర్వదించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు పగిడేరు గ్రామంలో వేల్పుల శ్రీరాములు సుమలత దంపతుల కుమార్తె ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించి, ఆమె భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది.

February 25, 2026 / 08:29 PM IST

గ్రామాల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

NRPT: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతున్న సర్పంచుల శిక్షణ తరగతుల శిబిరాన్ని బుధవారం ఎస్పీ డాక్టర్ వినీత్తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించాలని చెప్పారు. వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

February 25, 2026 / 08:27 PM IST

విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు

MDK: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో రాజ్పల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తూ, వారి చదువును పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక సమయసారిణిని అందజేయడమే కాకుండా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

February 25, 2026 / 08:27 PM IST

253 మంది విద్యార్థుల గైర్హాజరు

JGL: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు.

February 25, 2026 / 08:26 PM IST

విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో భారీ చోరీ

HYD: హబ్సిగూడలో నివసించే ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో పనిమనిషే 9.30 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె వద్ద నుంచి దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 08:26 PM IST

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం

KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 25, 2026 / 08:26 PM IST

‘ఆదివాసీ మహిళల హక్కుల సదస్సును విజయవంతం చేయాలి’

MHBD: బయ్యారం మండల కేంద్రంలో బుధవారం తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 8న గుండాలలో నిర్వహించనున్న ఆదివాసీ మహిళల హక్కుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర సదస్సు పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు ఉన్నారు.

February 25, 2026 / 08:25 PM IST

లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కైలాష్

ADB: లంబాడి హక్కుల పోరాట సమితి నార్నూర్ మండలాధ్యక్షుడిగా జాదవ్ కైలాష్ బుధవారం నియామకమయ్యారు. ఈ సందర్బంగా LHPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. లంబాడీ-బంజారా సమాజాభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం, లంబాడీల హక్కుల సాధన కోసం కృషి చేయాలనీ పేర్కొన్నారు. దీంతో పలువురు కైలాష్‌ను అభినందించారు.

February 25, 2026 / 08:22 PM IST

అకాల వర్షాలతో మామిడి రైతు విలవిల

VKB: కుల్కచర్ల మండలంలో అకాల వర్షాంతో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. వేరుశనగ రైతులు పల్లికాయలకు నీరు సమృద్ధిగా అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మామిడి రైతులు మాత్రం దిగాలుగా ఉన్నారు. వేసవికాలంలో వర్షాలు కురుస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని బాధిత రైతులు వాపోతున్నారు.

February 25, 2026 / 08:21 PM IST

మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

SRCL: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. 2009 నుంచి 2012 వరకు పెండింగ్లో ఉన్న 3 ఏళ్ల పీఎఫ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఖదీర్ పాషా వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 08:18 PM IST

‘చిత్తడి నేలలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం’

NRML: చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. గురువారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ దృక్కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

February 25, 2026 / 08:15 PM IST

పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు: డీపీవో

JGL: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం నర్సింహునిపేట గ్రామంలో పారిశుధ్య పనులను డీపీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువల పరిశుభ్రతను తరచూ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.

February 25, 2026 / 08:14 PM IST

సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తా

SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ వైస్ చైర్మన్ రేణుకలు ఇంఛార్జ్ మంత్రి వివేక్‌ను బుధవారం కలిశారు. మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 25, 2026 / 08:11 PM IST