KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్ రిహన కమల్ పాషాని శుక్రవారం సత్తుపల్లిలో 5 వ వార్డ్ కౌన్సిలర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ దృష్టికి సమస్య వచ్చిన వెంటనే పరిష్కార దిశగా కృషి చేయాలని నూతన ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
VKB: తాండూరు మార్కెట్ కమిటికి మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరిగిందని కమిటి ఛైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. తాండూరు మార్కెట్ కమిటికి రాజీనామా చేసిన పట్లోళ్ల బాల్ రెడ్డి గురువారం కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రూ. 29 కోట్లతో 100 షాపులు, కవర్ షెడ్లు, సీసీ రోడ్లు, ప్రహారి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
NGKL: పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 14 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పీఎం శ్రీ స్కూల్స్ పథకం కింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న 22 యూనిట్ల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
NLG: నల్గొండ జిల్లా గంధంవారిగూడెం SLBC గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపల్ లలితా కుమారి, వడ్డేపల్లి నాగరాజు గురువారం ఘనంగా సన్మానించారు. పట్టుదలతో శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని వారు ఈ సందర్భంగా విద్యార్థులను కొనియాడారు.
BDK: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై ఎన్ కౌంటర్ జరిగినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. దండకారణ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని, అధికారికంగా తామే వెల్లడిస్తామని తెలిపారు.
SDPT: జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో నిండుకున్న డ్రైనేజీలను మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య పారిశుద్ధ్య కార్మికులచే క్లీన్ చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. ఈ మేరకు కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
NZB: బోధన్ మండలం సాలురా ప్రధాన రహదారిపై నాగన్పల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో బాధితులను ఆసుపత్రికి తరలించారు.
SRD: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీటిని తీసుకోవచ్చన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
MNCL: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో మంచిర్యాల నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్ల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా డివిజన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరుస్తామని, శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటుకు త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు.
ASF: RSS, వనవాసి కళ్యాణ పరిషత్లో కీలక బాధ్యతలు నిర్వహించిన వాడపల్లి గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటని MLA హరీష్ బాబు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం ఆదర్శనగర్లో గరుడాచలం అనారోగ్యంతో మృతి చెందారని తెలిసి ఆయన నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
KMR: దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం సాయంత్రం అధికారులు కూల్చి వేశారు. ఓ నాయకుడు గ్రామంలో అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు.అయినప్పటికీ హైకో ర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివేయించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,000గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
SRD: సిర్గాపూర్ పీఎం పాఠశాతకు చెందిన విద్యార్థులు ఎక్స్ప్లోజర్ విజిట్ ఇండస్ట్రియల్ టూర్కు వొకేషనల్ విద్యార్థులు 50 మంది శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ICT గూగుల్ మైక్రోసాఫ్ట్ గచ్చిబౌలి (బాయ్స్), బ్యూటీ అండ్ వెల్నెస్ అను హెర్బల్ ఇండస్ట్రీ సుల్తాన్పూర్ ( గర్ల్స్) లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు PD తెలిపారు.
SRPT: పెన్పహాడ్ మండలంలోని ధర్మాపురం గ్రామంలో శుక్రవారం వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక మధిరామక్క చెరువులో నీటి కుక్క కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఉదయాన్నే ఈ వింత జీవిని చూసిన యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వార్త వైరల్గా మారింది. సముద్రాల్లో ఉండే జంతువు తమ చెరువులో కనిపించడంతో జనం ఎగబడ్డారు.
NLG: చిట్యాల మండలం నేరడలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వద్ద నిధులు లేవని అధికారులు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు అండగా ఉంటామని బీజేపీ నేత శంకరాచారి పేర్కొనగా, ఇందిరమ్మ ఇళ్ల హామీపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు.