WGL: రాయపర్తి మండలం శివరామపురంలో తాగునీటి బోర్ల మోటార్లకు శుక్రవారం మర్మమత్తుల కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ పెద్దగోని నాగరాజుగౌడ్ వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో చెడిపోయిన మోటార్లను బయటకు తీసి వాటిని రిపేర్ చేశారు. అనంతరం మళ్లీ బోర్లలో మోటార్లను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం రోజున కళ్యాణ లక్ష్మీ చెక్కుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి వైస్ ఛైర్మన్ బంక చందు తోటపల్లి సర్పంచ్ బంక లక్ష్మీ గాంధీనగర్ సర్పంచ్ పోలు సంపత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ లబ్ధిదారులు, అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
NZB: రైల్వే ట్రాఫిక్ బ్లాక్ నేపథ్యంలో కొన్ని రైళ్లకు దారి మళ్లింపు చేసినట్లు CPRO శ్రీధర్ తెలిపారు. మే 3,5వ తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ (12791) ఎక్స్ప్రెస్ను కాజీపేట జంక్షన్ మార్గం కాకుండా సికింద్రాబాద్-NZB-పెద్దపల్లి మార్గం మీదుగా నడిపించనున్నారు. మే 4న యశ్వంత్పూర్-లక్నో 22683 ఎక్స్ప్రెస్ను కాచిగూడ-NZB పెద్దపల్లి మార్గంలో దారి మళ్లిస్తున్నారు.
MDK: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో 100% ఆస్తి పన్ను వసూలు చేయాలని మెదక్ మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు అధికారులను ఆదేశించారు. గురువారం వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
NLG: 6వ తేదీన జరగాల్సిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం ఈ నెల 7కు వాయిదా వేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అధికారులు, సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కోరారు. పరిపాలన పరమైన కారణాల వల్ల సన్నాహక సమావేశం ను వాయిదా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.
HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్లో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా జలమండలి (HMWSSB) ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మణికొండ, కోకాపేట్, నార్సింగి, షేక్పేట్, భోజగుట్ట వంటి ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్తో నీరు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు.
SRD: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంతో అవసరమని DM సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఖేడ్ TGSRTC డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు భద్రత కార్యక్రమాలకు సహకరించాలన్నారు.
MBNR: హన్వాడ మండలం కిష్టంపల్లికి చెందిన గాయత్రి తనకు పురిటి నొప్పులు రావడం వలన 108కి ఫోన్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది శ్రీనివాస్ ఇంటి దగ్గరే కాన్పు చేయడం వల్ల ఆమె పండంటి మగ బిడ్డకు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించినట్లు పైలెట్ సలీం, శ్రీనివాస్ తెలిపారు.
SRPT: నూతనకల్ మండలం పెదనేమిల గ్రామంలో సీసీ రోడ్డు ప్రక్కన మట్టిని చదును చేసి పనులు శుక్రవారం వేగంగా సాగుతున్నాయి. రోడ్డుకు రెండు వైపులా ఎత్తుపల్లాలుగా ఉన్న మట్టి వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారారని గుర్తించిన సర్పంచ్.. ట్రాక్టర్ సహాయంతో లెవలింగ్ చేయించారు. దీనివల్ల ఎదురుగా వచ్చి వాహనాలు పక్కకు తప్పుకోవడానికి వీలుంటుందని సర్పంచ్ తెలిపారు.
HNK: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేం నరేందర్ రెడ్డిని కుడా ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి నేడు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను కలిసి, పూలబొకే అందజేసి, శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాల గురించి వారు చర్చించారు.
పాత వైర్లను సరి చూసుకొని అవసరమైతే కొత్త వైర్లను మార్చుకోవాలని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. చాలావరకు విద్యుత్ షాక్తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అవసరం లేనప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం అని తెలిపారు. రానున్న ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా మరింత జాగ్రత్త పడాలి అన్నారు.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేడు జరిగే శివకళ్యాణంకు విస్తృత ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం పార్కింగ్ వద్ద శివార్చన స్టేజ్ వద్ద కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. క్యూలైన్లు, భోజన వసతి, త్రాగునీరు, నీడ కోసం టెంట్లు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు, కూలర్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు
NGKL: పోక్సో కేసులో ఓ నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. NGKL లోని శ్రీపురం రోడ్డు సంజయ్ నగర్ కాలనీకి చెందిన సుజిత్ (గణేశ్) (21)పై 2024లో కైమ్ నంబర్ 294 పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా స్పెషల్ జడ్జి నసీం సుల్తానా నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ. 20 వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.
MNCL: జిల్లా కేంద్రంలో శుక్రవారం జాతీయ డెంటిస్ట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా దంత పరీక్షలు చేసి.. దంతాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ బండి హరీష్ గౌడ్ అవగాహన కల్పించారు. దంతాల సంరక్షణ శరీర ఆరోగ్యానికి, మంచి జీర్ణక్రియకు ముఖ్యమని తెలిపారు.
ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www .apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.