HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్లో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా జలమండలి (HMWSSB) ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మణికొండ, కోకాపేట్, నార్సింగి, షేక్పేట్, భోజగుట్ట వంటి ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్తో నీరు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు.