• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నార్లాపూర్-పులిమామిడి రహదారిలో నిలిచిన కెనాల్ పనులు

మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్-పులిమామిడి రహదారిలో కొండ పోచమ్మ కెనాల్ పనులు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి అడ్డంగా గుంతలు ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

April 11, 2026 / 10:25 AM IST

ఇల్లందలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం సర్పంచ్ బేతి సాంబయ్య పాల్గొని అడ్మిషన్ అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహార భోజనం అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీరాణి తెలిపారు.

April 11, 2026 / 10:25 AM IST

మహిళల విముక్తి కోసం ఫూలే ఎనలేని కృషి

BDK: బీసీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ అసోసియేషన్ సభ్యులు, మార్క్‌ఫెడ్  డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మహిళల విముక్తి కోసం జ్యోతిరావు ఫూలే జీవితాంతం ఎనలేని కృషి చేశారని వారు తెలిపారు. విద్యనే సమానత్వానికి ఆయుధంగా భావించిన వ్యక్తి అని అన్నారు.

April 11, 2026 / 10:23 AM IST

గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే: MLA

RR: మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు.

April 11, 2026 / 10:22 AM IST

‘బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే’

SRPT: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజి రోడ్డు సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.

April 11, 2026 / 10:20 AM IST

‘జ్యోతిబా ఫూలే కృషి మరువలేనిది’

SRCL: అంటరానితనాన్ని అస్పృశ్యతను రూపుమాపడానికి జ్యోతిబా ఫూలే చేసిన కృషి మరువలేనిదని కాంగ్రెస్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ముస్కాన్ పెట్‌లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహిళా విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.

April 11, 2026 / 10:20 AM IST

కంపు కొడుతున్న పరిగి మార్కెట్ యార్డ్

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డ్ పరిసరాలు చెత్తాచెదారంతో పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. శనివారాల్లో మార్కెటుకు వచ్చే వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించాలని ప్రజలు కోరారు.

April 11, 2026 / 10:19 AM IST

ఉద్యోగ సంఘం నేతలు ముందస్తు అరెస్టు

BDK: పాల్వంచ కేటీపీఎస్‌లో సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు మద్దతు పలికేందుకు బయలుదేరిన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ ఖమ్మం నుంచి బయలుదేరిన పలువురు ఉద్యోగ సంఘం నేతలను జూలూరుపాడులోని సాయిబాబా ఆలయం వద్ద అడ్డుకుని స్టేషన్‌కు తరలించినట్లు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవి తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు అన్నారు.

April 11, 2026 / 10:13 AM IST

‘జనగణన ఖచ్చితంగా పూర్తి చేయాలి’

MBNR: జిల్లాలో జనాభా గణన ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా, నిర్దేశిత సమయపాలనతో పూర్తి చేయాలని MRO ఎన్.విద్యాసాగర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటి వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ఎంపీడీవో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి గణనను విజయవంతం చేయాలని తెలిపారు.

April 11, 2026 / 10:13 AM IST

చర్లపల్లి పాఠశాలలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

HNK: నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మహాత్మా జ్యోతిరావుపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ.. సమాజంలో కులవివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి, వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు.

April 11, 2026 / 10:08 AM IST

ఝాన్సీలింగాపూర్ పెద్ద చెరువును పరిశీలించిన అధికారులు

MDK: రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామ పెద్ద చెరువును తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ తనిఖీలో ఎంపీడీఓ షాజులుద్దీన్, అటవీ శాఖ అధికారి (FRO) విద్యాసాగర్, సాగునీటి శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు చెరువు కట్టల పటిష్టతను, ఇతర సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించి తగు సూచనలు చేశారు.

April 11, 2026 / 10:05 AM IST

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి

NZB: సాలూరు మండలం హున్సా గ్రామపంచాయతిలో విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను సర్పంచ్ మర్కల్ శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముర్గె శంకర్, ముద్ద ఈర్వంత్ రావు, దేశాయి శంకర్ పాల్గొన్నారు.

April 11, 2026 / 10:05 AM IST

ఆత్మాభిమానం కోసం పదవికి గుడ్ బై: ఎక్సైజ్ DC

NZB: ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి వేధింపులు భరించలేక NZB డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తనఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ అందరి ముందు దుర్భాషలాడారని, అవమానాన్నితట్టుకోలేక, ఆత్మాభిమానం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చైతన్యం చచ్చిపోయిన ఈ శాఖలో 30 ఏళ్లు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.

April 11, 2026 / 10:04 AM IST

ఆత్మాభిమానం కోసం పదవికి గుడ్ బై: ఎక్సైజ్ DC

NZB: ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి వేధింపులు భరించలేక NZB డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తనఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ అందరి ముందు దుర్భాషలాడారని, అవమానాన్నితట్టుకోలేక, ఆత్మాభిమానం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చైతన్యం చచ్చిపోయిన ఈ శాఖలో 30 ఏళ్లు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.

April 11, 2026 / 10:04 AM IST

ఇల్చీపూర్ సరస్వతీ మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇల్చీపూర్ సరస్వతీ మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ఫల పంచామృత అభిషేకం, హారతి, మంత్రపుష్పం మొదలగు పూజలు చేసి అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ అర్చకులు దత్తాత్రేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు పాల్గొన్నారు.

April 11, 2026 / 10:03 AM IST